అసెంబ్లీ నుంచి ఈట‌ల రాజేంద‌ర్ స‌స్పెన్ష‌న్

శీతాకాల అసెంబ్లీ స‌మావేశాలలో బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ పై స‌స్పెన్ష‌న్ వేటు ప‌డింది.

నేటి స‌మావేశాల్లో ఈట‌ల‌ను స‌స్పెండ్ చేస్తూ అసెంబ్లీ వ్య‌వ‌హారాల చీఫ్ ప్ర‌శాంత్ రెడ్డి తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు.

దీన్ని అసెంబ్లీ కూడా ఆమోదించ‌డంతో ఆయ‌న సస్పెండ్ అయ్యారు.ఈనెల 6 న స్పీక‌ర్ పోచారంపై ఈట‌ల మ‌ర‌మ‌నిషి అంటూ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపాయి.

ఈ క్ర‌మంలో స్పీక‌ర్ కు ఈట‌ల‌ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది.ఇందుకు స‌సేమీరా అన‌డంతో ఆయ‌న‌ను స‌స్పెండ్ చేశారు.

అయితే ఈ సెష‌న్ వ‌ర‌కు స‌స్పెన్ష‌న్ వ‌ర్తిస్తుంద‌ని స్పీక‌ర్ తెలిపారు.

Advertisement
ఆ విషయంలో ప్రభాస్, నాని గ్రేట్ అంటున్న అభిమానులు.. అసలేమైందంటే?

తాజా వార్తలు