మన దేశంలో విఐపీల రక్షణ కోసం కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్న విషయం తెల్సిందే.ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాకుండా పార్టీలు మరియు ప్రైవేట్ సంస్థలు కూడా పెద్ద ఎత్తున రాజకీయ నాయకులకు భద్రత ఏర్పాట్లు చేస్తున్న విషయం తెల్సిందే.
భారత ప్రధాని ఎటు వెళ్లిన కూడా పదుల సంఖ్యలో కార్లు మరియు అధికారులు వెళ్లాల్సి ఉంటుంది.ప్రధాని కాన్వాయ్ వెళ్లిన సమయంలో ఏకంగా అరగంట నుండి ముప్పావు గంట పాటు ట్రాఫిక్ మొత్తం మల్లించడం లేదంటే నిలిపేయడం చేస్తారు.
ప్రతి రోజు కూడా ప్రధాని పార్లమెంట్కు వెళ్లాల్సి వస్తున్నందున ఆయన వెళ్లే సమయంలో ఢిల్లీ మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు.అది సామాన్య ప్రజలకు చాలా ఇబ్బందిని కలుగ జేస్తుంది.
అందుకే ప్రధాని ఇంటి నుండి పార్లమెంటుకు సొరంగ మార్గంలో రోడ్డును ఏర్పాటు చేయడం వల్ల ప్రధాని భద్రతకు ఢోకా ఉండదు, అలాగే ప్రధాని వల్ల సామాన్య జనాలు ఇబ్బందులకు గురి కారు.సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని నిర్మించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.