ఓయ్ సినిమా డైరెక్టర్ ఆనంద్ రంగా పెద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్.ఎంత పవన్ కళ్యాణ్ ఫాన్ అయినా అతను ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సమయంలో బృందం అంతా పడిన కష్టాలతో సినిమా తీయాలా ? నిజంగానే తీసాడు ” ‘ ఎరుపు’ అనే చిత్రం కథాంశం గా ‘ అత్తారింటికి దారేది’ పైరసీ వెనక జరిగిన వృతాంతం నే తీసుకుంటున్నారు అని తెలుస్తోంది.
ఈ చిత్రం లో సుధీర్ , ప్రత్యూష ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్ర మొదటి టీజర్ ని క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ , హీరో సిద్దార్ధ చేతుల మీదగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ చెయ్యాలని ప్లాన్ చేసారు.
ట్విట్టర్ ద్వారా వీరిద్దరి చేతుల మీదగా ఈ టీజర్ ని విడుదల చేశారు.ఈ టీజర్ చూసిన తర్వాత ఈ సినిమా నేపద్యం, కథ ఒక డౌట్ ని క్రియేట్ చేస్తుంది.
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్లాక్బస్టర్ సినిమా ‘అత్తారింటికి దారేది’ రిలీజ్కు ముందే పైరసీకి గురైన సంగతి విధితమే.ఈ సంఘటననే ఈ ఎరుపు సినిమా కధాశంగా తీసుకొని అత్తారింటికి దారేది పైరసీకి వెనుక జరిగిన కథ, పైరసీకి ప్రధాన పాత్ర పోషించిన వారి నేపథ్యాన్ని ఎంచుకొని ఈ సినిమాను తెరకెక్కించారు.