విలన్ గా మారిన ఎర్ర బెల్లి

టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి జంప్ అయిన టీ టీడీపీ ప్లోర్ లీడర్ ఎర్రబెల్లి దయాకర్రావు కేసీఆర్ కేబినెట్లో ముగ్గురు మంత్రులకు పాలిట విలన్గా మారనున్నట్టు సమాచారం.టీడీపీ ప్లోర్ లీడర్గా అధికార పార్టీలో చేరడంతో ఎర్రబెల్లికి కేసీఆర్ సముచిత గౌరవం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

 Errabelli Turns Villain-TeluguStop.com

ఎర్రబెల్లి పార్టీలో చేరేటప్పుడు ఆయన జీవిత కాల కోరికగా ఉన్న మంత్రి పదవి పొందేందుకు కేసీఆర్ నుంచి హామీ కూడా పొందినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు, రాజ్యసభ ఎన్నికల తర్వాత కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్టు తెలుస్తోంది.

ఈ విస్తరణలో ఎర్రబెల్లి కేబినెట్లోకి వస్తే ఈ విస్తరణ సాకు చూపి కేసీఆర్ మొత్తం ముగ్గురు మంత్రులపై వేటు వేయనున్నట్టు తెలుస్తోంది.కేసీఆర్ సామాజికవర్గానికే చెందిన ఎర్రబెల్లికి మంత్రి పదవి ఇస్తే అదే సామాజికవర్గానికి చెందిన మహబూబ్నగర్ జిల్లాకు మంత్రి జూపల్లి కృష్ణారావుపై వేటు వేస్తారని తెలుస్తోంది.

అలాగే పార్టీలో సీనియర్ నాయకుడు అయిన నాయిని నర్సింహారెడ్డిని వయస్సు రీత్యా తప్పించి ఆయన సేవలను పార్టీకి వాడుకుంటారని తెలుస్తోంది.నాయినిని మంత్రి వర్గం నుంచి తప్పిస్తే ఆయన నిర్వహిస్తున్న హోం శాఖను ఎర్రబెల్లికి లేదా రెడ్డి సామాజికవర్గంలో మరో సీనియర్కు ఇస్తారని కూడా టాక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube