కమల్ హసన్ కెరియర్ ఆరంభంలో తమిళంలో సిగప్పు రోజక్కల్ అనే సినిమాలో నటించాడు.ఈ సినిమా తెలుగులో ఎర్ర గులాబీలు పేరుతో డబ్బింగ్ అయ్యింది.
ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీదేవి నటించింది.ఇక ఇందులో కమల్ హసన్ నెగిటివ్ రోల్ లో అమ్మాయిలని ప్రేమించి వారిని అతి కిరాతకంగా చంపేసే సైకో పాత్రలో నటించాడు.
భారతీరాజా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.ప్రేమలో మోసపోయిన ఒక యువకుడు అదే ప్రేమతో అమ్మాయిల జీవితాలని నాశనం చేసే ఇతివృత్తంగా ఈ కథని దర్శకుడు ఆవిష్కరించాడు.
శ్రీదేవి అతనిని ప్రేమించి తరువాత అతని ఘోరాలు తెలుసుకొని పోలీసులకి పట్టిస్తుంది.ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని భారతీరాజా తనయుడు మనోజ్ ప్లాన్ చేస్తున్నాడు.
ఎప్పటి నుంచి దర్శకుడుగా మారడానికి ప్రయత్నాలు చేస్తున్న మనోజ్ దానికోసం ఈ సినిమాని ఎంచుకున్నాడు.
ఇక ఈ సీక్వెల్ లో ప్రేమపేరిట మోసం చేసే కుర్రాళ్లపై పగ తీర్చుకునే యువతిగా హీరోయిన్ పాత్రను తీర్చిదిద్దుతున్నారట.
ఈ పాత్ర కోసం తాజాగా కీర్తి సురేశ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.కీర్తి సురేశ్ అయితే, ఈ పాత్రకు బాగా సూట్ అవుతుందని మనోజ్ భావిస్తున్నాడట.
మొదటి భాగంలో కమల్ హసన్ చేసినటువంటి సైకో తరహాలో పాత్ర కోసం కీర్తిని ఎంపిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు.అయితే ప్రస్తుతం ఏకంగా ఎనిమిది సినిమాల వరకు లైన్ లో పెట్టిన కీర్తి డైరీ ఫుల్ గా ఉంది.
అందులో చాలా వరకు స్టార్ హీరోల సినిమాలు, ఫిమేక్ సెంట్రిక్ కథలే ఉన్నాయి.ఇలాంటి సమయంలో నెగిటివ్ రోల్ లో కీర్తి నటించడానికి ఎంత వరకు ఒకే చెబుతుంది అనేది ఇప్పుడు సందేహంగా ఉంది.
.