టీడీపీకి అసంతృప్తి సెగ! పార్టీ వీడే యోచనలో ఏరాసు!

ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం ఎన్నికల కమిషన్ ప్రకటించే అవకాశం వుంది.ఇక ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపధ్యంలో ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ అభ్యర్ధులని ప్రకటించేస్తున్నారు.

 Erasu Prathap Reddy Ready To Resign Tdp-TeluguStop.com

చాలా వరకు నియోజక వర్గాలలో ఎమ్మెల్యే అభ్యర్ధులని ప్రకటిస్తున్న బాబు చాలా వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకి, గతంలో పోటీ చేసిన వారికే అవకాశం ఇస్తున్నారు.అయితే తాజాగా వైసీపీ పార్టీ నుంచి టీడీపీలో కొంత మంది చేరుతున్నారు.

అలా తాజాగా ప్రాణ్యం నియోజక వర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే గౌరు చరిత టీడీపీలో చేరగా ఆమెకి ప్రాణ్యం టికెట్ ని బాబు ప్రకటించారు.

ఇదిలా వుంటే గత ఎన్నికలలో టీడీపీ పార్టీ తరుపున ప్రాణ్యం నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా బరిలో నిలిచిన ఏరాసు ప్రతాప్ రెడ్డి చివరి వరకు తనకే టికెట్ వస్తుందని ఆశించారు.

అయితే ఊహించని విధంగా గౌరు చరితకి టికెట్ ఇవ్వడంతో అతను చంద్రబాబుపై అసంతృప్తిగా వున్నట్లు తెలుస్తుంది.నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశానికి కూడా అతను హాజరుకాలేదని తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో తన అనుచరులతో ఈ రోజు చర్చించిన తరువాత పార్టీ వీడే ఆలోచనలోఏరాసు ప్రతాపరెడ్డి వున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube