ప్రజారోగ్య నిబంధనలను రూపొందించడానికి ప్రభుత్వం ఉపయోగించే శాస్త్రీయ పరిశోధనలను పరిమితం చేయాలని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (ఈపీఏ) యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఈపీఏ ప్రతిపాదన యొక్క ముసాయిదా ప్రకారం.
శాస్త్రవేత్తలు నివేదికలు రూపొందించే ముందు డేటా, రహస్య వైద్య రికార్డులతో సహా, ఏజెన్సీ అధ్యయనం యొక్క తీర్మానాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ చర్య కొత్తగా స్వచ్ఛమైన గాలి మరియు నీటి నిబంధనలను అమలు చేయడాన్ని క్షిష్టతరం చేస్తుందని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.
సైన్స్కు సంబంధించిన అనేక విభాగాల్లో డేటాను ప్రచురించడం సాధారణమైన అంశమే.అయితే ఆరోగ్యానికి సంబంధించిన శాస్త్రవేత్తలు వ్యక్తి స్వేచ్ఛ పరిమితులకు లోబడి ఉండటం వల్ల డేటాను ప్రచురించకపోవచ్చునని ఈపీఏ అభిప్రాయపడింది.
తమ ఏజేన్సీ శాస్త్ర సంబంధిత విషయాల్లో పారదర్శకతకు కట్టుబడి ఉందని.2020లో సప్లిమెంటరీని ఖరారు చేయడానికి కసరత్తు చేస్తోందని ఈపీఏ ఒక ప్రకటనలో తెలిపింది.ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియమాలు మరియు నిబంధనలను రూపొందించేందుకు ఉపయోగిస్తున్న శాస్త్ర ప్రమాణాలపై దేశ ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఈపీఏ కృషిచేస్తోంది.అయితే డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన మొదటి రెండేళ్లలో పర్యావరణ నిబంధనలను తగ్గించడంలో ఈపీఏ తన లక్ష్యాలను అధిగమించిందని సెప్టెంబర్లో విడులైన వాచ్డాగ్ నివేదక వెల్లడించింది.