దేశంలో కరోనా కేసుల సంఖ్య ఉన్న కొద్దీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా గానీ కేసులు ఈ రీతిగా పెరగటం కేంద్ర ప్రభుత్వాన్ని టెన్షన్ పెట్టిస్తోంది.
పరిస్థితి ఇలా ఉండగా మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఛత్తీస్ గడ్, పంజాబ్, మధ్యప్రదేశ్ వంటి చోట్ల భారీగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలను హెచ్చరించడం జరిగింది.
అంత మాత్రమే కాక కొత్త రకం కరోనా వైరస్ ఛాయలు కనిపిస్తున్నాయి అందరూ జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించింది.ఇటువంటి తరుణంలో దేశ రాజధాని ఢిల్లీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది.మేటర్ లోకి వెళ్తే వైరస్ ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన వారు ఎవరైనా ఢిల్లీలో అడుగుపెట్టాలంటే కచ్చితంగా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ చూపించాల్సిందే అని కొత్త రూల్ తీసుకొచ్చింది.