ఏపీలో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు..!

ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి.ప్రవేశ పరీక్షల తేదీలకు సంబంధించిన హెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.

 Andra Pradesh, Ap Entrance Exams Dates, Education Minister Adhimulapu Suresh, Ea-TeluguStop.com

సెప్టెంబర్ 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.ఇక సెప్టెంబర్ 10, 11వ తేదీల్లో ఐ-సెట్, సెప్టెంబర్ 14వ తేదీన ఈ-సెట్, సెప్టెంబర్ 28, 29, 30న ఏపీ పీజీఈ-సెట్ పరీక్షలు జరగనున్నాయి.

ఇక అక్టోబర్ 1వ తేదీన ఉదయం ఎడ్ సెట్, మధ్యాహ్నం లా-సెట్ నిర్వహించనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.అక్టోబర్ 2 నుంచి 5వ తేదీ వరకు ఏపీపీఈ సెట్ పరీక్షలు జరగనున్నట్లు స్పష్టం చేశారు.

కాగా, తెలంగాణలో ఈ నెల 31న ఈ-సెట్, సెప్టెంబర్ 2వ తేదీన పాలిసెట్, సెప్టెంబర్ 9, 10, 11, 14 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్ ను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube