సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు ఓటీటీలో అందుబాటులోకి వస్తే ఆ సినిమాలను థియేటర్లలో చూడటానికి ఎవరూ ఆసక్తి చూపరు.నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన అఖండ సినిమా విడుదలై 50 రోజులు దాటినా ఈ సినిమాకు ప్రేక్షకాదరణ ఏ మాత్రం తగ్గలేదు.
ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో అఖండ సినిమా స్ట్రీమింగ్ అవుతుండటం గమనార్హం.
హాట్ స్టార్ లో రికార్డు స్థాయిలో అఖండ సినిమాకు వ్యూస్ వస్తుండగా బాలయ్యకు మాస్ ప్రేక్షకుల్లో క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని అఖండ సినిమాతో ప్రూవ్ అయింది.
అయితే ఈ సినిమాకు సంబంధించి చోటు చేసుకున్న ఒక ఘటనను బాలయ్య అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.ఏపీలోని ఒక గ్రామ ప్రజలు మైదానంలో కూర్చుని అఖండ సినిమాను చూశారు.
ఆ గ్రామ మంతటా అఖండ ప్రదర్శనతో బాలయ్య పేరు మారుమ్రోగింది.సాధారణంగా పాత రోజుల్లో ఈ తరహాలో సినిమాల ప్రదర్శన జరిగేది.
టీవీలు, స్మార్ట్ ఫోన్లు అందు బాటులోకి రావడంతో ప్రస్తుతం ఎవరూ ఈ విధంగా సినిమాలను చూడటం లేదు.అయితే బాలయ్య మాత్రం అఖండ సినిమాతో తన స్టామినాను మరోసారి ప్రూవ్ చేసుకున్నారు.తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా అఖండ సినిమాకు భారీ స్థాయిలో ఆదరణ దక్కింది.ఓవర్సీస్ లో కూడా అఖండ సినిమా మంచి కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.
ఫుల్ రన్ లో ఈ సినిమా నిర్మాతకు థియేట్రికల్ కలెక్షన్ల ద్వారా 20 కోట్ల రూపాయల వరకు లాభాలను అందించిందని సమాచారం.అఖండ మలయాళ వెర్షన్ కూడా హాట్ స్టార్ లో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.తమన్ బీజీఎం ఈ సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లిందనే కామెంట్లు నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి.