సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు మరియు అల వైకుంఠపురంలో చిత్రంతో పాటు ఎంత మంచివాడవురా చిత్రం కూడా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.ఈ చిత్రం గురించి ప్రేక్షకులు ఎక్కువగా ఆతృతతో లేరు.
అయినా కూడా చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం చాలా నమ్మకంతో సంక్రాంతికి సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు.భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న చిత్రాలకు పోటీ అన్నట్లుగా ఈ చిత్రంను విడుదల చేస్తున్నారు అంటే సినిమాపై వారికి ఉన్న నమ్మకం ఏంటో చెప్పుకోవచ్చు.
కళ్యాణ్ రామ్కు జోడీగా ఈ చిత్రంలో మెహ్రీన్ నటించింది.తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.క్లీన్ యూ సర్టిఫికెట్తో ఈ చిత్రం సెన్సార్ నుండి బయట పడింది.ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ చిత్ర యూనిట్ సభ్యులకు సెన్సార్ వారు ప్రశంసలు కురిపించారట.
తప్పకుండా ఈ చిత్రం శతమానం భవతి చిత్రం స్థాయిలో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలుస్తుందని చెప్పుకొస్తున్నారు.సరిలేరు నీకెవ్వరు చిత్రం ఈనెల 15న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.