నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా మెహ్రీన్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ఎంత మంచివాడవురా.ఈ చిత్రానికి శతమానం భవతి ఫేం సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించాడు.
దారుణమైన ఫలితాన్ని ఈ చిత్రం చవి చూసింది.సంక్రాంతి సినిమాల పోటీని ఈ చిత్రం ఏమాత్రం తట్టుకోలేక పోయింది.
వచ్చింది, పోయింది అన్నట్లుగానే ఈ సినిమా పరిస్థితి అయ్యింది.మొదటి రోజు 2.35 కోట్ల షేర్ను దక్కించుకున్న ఈ చిత్రం ఆ తర్వాత రోజు నుండే ఢీలా పడిపోయింది.
మొదటి వారం రోజులు పూర్తి అయ్యేప్పటికి ఈ సినిమా ఉంటుందో లేదో కూడా తెలియడం లేదు.అల వైకుంఠపురంలో మరియు సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని చూస్తున్న ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపడం లేదు.సంక్రాంతి సెలవులు పూర్తి అయ్యాయి కనుక ఇక ఈ సినిమాను పట్టించుకునే నాధుడు ఉండక పోవచ్చు అంటున్నారు.
సంక్రాంతికి విడుదల చేయడం పెద్ద తప్పుగా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రం అన్ని ఏరియాల్లో కలిపి దాదాపుగా 11.5 కోట్ల వరకు బిజినెస్ చేసిందట.కాని ఫలితం చూస్తే మాత్రం లాంగ్ రన్లో కూడా కనీసం 5 కోట్ల వరకు వసూళ్లు చేసే పరిస్థితి లేదు.
అంటే దాదాపుగా ఆరున్నర కోట్ల లాస్ ఈ మంచి వాడు మిగల్చబోతున్నాడు.నిర్మాతలకు కూడా భారీ ఎత్తున నష్టాలు మిగలబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.బయ్యర్లు మరియు నిర్మాతలు ఈ మంచివాడిని నమ్మి మోసపోయినట్లే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కళ్యాణ్ కథ ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే ఇలాంటి ఫలితాలు ఇంకా చాలా చూడాల్సి వస్తుందని నందమూరి అభిమానులు హెచ్చరిస్తున్నారు.