మొదటి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు సాధించిన ఇంగ్లాండ్..!

గత నెలలో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్ లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను మట్టి కరిపించి చారిత్రాత్మక విజయాన్ని అందుకని సగర్వంగా స్వదేశానికి చేరుకుంది.తాజాగా చెన్నై లో భారత్ – ఇంగ్లండ్ జట్ల మధ్య సిరీస్ మొదలయ్యింది.

 England Set Huge Target To India In Chennai Test Series, England Scored, Huge Sc-TeluguStop.com

ఈ టెస్ట్ లో భాగంగా మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు సాధించింది.భారత బౌలర్లు ఇంగ్లాండ్ జట్టు బ్యాట్స్మెన్స్ ల వికెట్లు తీయడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చింది.

ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ మొదటి ఇన్నింగ్స్ లో సాధించిన పరుగులు విషయానికి వస్తే.ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ జో రూట్ 19 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 218 పరుగులు చేయగా.

సిబిల్, బెన్ స్టోక్స్ అర్థ సెంచరీలతో భారీ స్కోరుకి కదంతొక్కారు.జట్టులోని మిగతా బ్యాట్స్మెన్ కూడా చెప్పుకోదగ్గ స్కోర్లు చేయగలిగారు.వీటితో పాటు టీమిండియా బౌలర్లు ఏకంగా 45 పరుగులను ఎక్స్ట్రా ల రూపంలో సమర్పించుకున్నారు.

Telugu Bowlers, Chennai, England Scored, England India, India-Latest News - Telu

ఇక టీమిండియా బౌలర్లు విషయానికి వస్తే.జస్ప్రిత్ బూమ్రా, రవిచంద్రన్ అశ్విన్ చెరో మూడు వికెట్లు తీసుకోగా.ఇషాంత్ శర్మ, నదీం చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది.రోహిత్ శర్మ కేవలం ఆరు పరుగులకే ఆర్చర్ బౌలింగ్ లో బట్లర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ప్రస్తుతం క్రిజ్ లో శుభమన్ గిల్, చటేశ్వర్ పుజారా బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube