సాధారణంగా పిల్లలు తమకు ఇష్టమైనది ఏం జరిగినా ఎంతో సంతోషపడతారు.ఇంకొందరు అయితే కన్నీళ్లు పెట్టుకుంటారు.
తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.క్రీడారంగంలో ఆటగాళ్లకు చాలా మంది అభిమానులుంటారు.
తమకు నచ్చిన క్రీడాకారుడ్ని చూడాలని, వారితో మాట్లాడాలని, ఓ సెల్పీ తీసుకోవాలని లేదంటే ఆటో గ్రాఫ్ తీసుకోవాలని అభిమానులు అనుకుంటూ ఉంటారు.అందుకోసం వాళ్లు ఎంతో ఉత్సాహ పడుతుంటారు.
ఎంతో ఆనంద పడుతుంటారు.అయితే ఆ ఆనందం కొంత మందికి మాత్రమే దక్కుతుంది.
అందులో కొందరు తమ అభిమాన క్రీడాకారుడి ఆటోగ్రాఫ్ తీసుకుంటే ఇంకొందరికి సెల్పీ తీసుకోవడం ఓ బహుమతిగా దక్కుతుంది.మరికొంత మందికి ఏకంగా వారితో బస చేసే అవకాశం కూడా దక్కుతుంది.
ఇందకొందరికి మాత్రం వారు అనుకోకుండానే వారు అభిమానించే వ్యక్తే ఇంటికి వచ్చి పలకరించడం వంటిది జరుగుతుంది.లేదంటే అభిమానికి గిఫ్ట్ పంపించడం జరుగుతుంది.
ఆ సమయంలో అభిమానులు ఎంతో ఆనంద పడుతుంటారు.తాజాగా జరిగిన ఘటన ఇలాంటిదే.యుఈఎఫ్ఎ 2020 ఛాంపియన్ షిప్ యూరో కప్ 2020లో ఇంగ్లండ్, డెన్మార్క్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది.ప్రస్తుతం ఆ ఆటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇంగ్లండ్ ఫుట్ బాలర్ మాసన్ మౌంట్ జరుగుతున్న మ్యాచ్ లో ఎంతో బాగా ఆడాడు.మ్యాచ్ విజయం సాధించింది.
దీంతో పాటు అతడు అభిమానుల మనస్సును అద్భుతంగా గెలుచుకున్నాడు.
ఇంగ్లండ్ 2-1 తేడాతో డెన్మార్క్ పై అద్భుతమైన విజయాన్ని అందుకుంది.55 ఏళ్ల తర్వాత మరో మెగాటోర్నీలో ఫైనల్ కు అడుగుపెట్టడమే కాకుండా ఈ ఉత్కంఠబరిత మ్యాచ్ లో విజయాన్ని అభిమానులు బాగా ఎంజాయ్ చేశారనే చెప్పుకోవచ్చు.మ్యాచ్ అయిపోయిన తర్వాత మౌంట్ ఓ గ్యాలరీ వద్దకు వెల్లి ఓ చిన్నారికి తన జెర్సీని అందజేశాడు.
దీంతో ఆ చిన్నారి గుక్క పట్టి ఏడ్చింది.తన తండ్రిని కౌగిలించుకుని బిగ్గరగా ఏడ్వడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
.