నీరవ్ మోదీ ఆస్తులని ఎటాచ్ చేసిన ఈడీ!

పన్ను ఎగవేత, బ్యాంకులకి వేల కోట్ల రూపాయిలలో టోపీ పెట్టి దేశం విడిచి పారిపోయి విదేశాలలో దాక్కుంటున్న వ్యాపార ప్రముఖులలో విజయ్ మాల్యా తర్వాత నీరవ్ మోదీ గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి.డైమాండ్ జ్యూయిలరీ వ్యాపారాలు చేస్తూ గుజరాత్ కి చెందిన నీరవ్ మోదీ బ్యాంకులకి టోపీ పెట్టి విదేశాలకి పారిపోయిన సంగతి అందరికి తెలిసిందే.

 Enforcement Directorate Attaches Nirav Modi Properties-TeluguStop.com

నీరవ్ మోదీ కేసుపై చాలా కాలంగా విచారణ చేస్తున్న ఈడీ తాజాగా అతనికి గట్టి షాక్ ఇచ్చింది.

భారత్ లో వున్న అతని ఆస్తులని ఒక్కొక్కటిగా స్వాదీనం చేసుకుంటున్న ఈడీ తాజాగా 147 కోట్ల విలువైన ఆస్తులని ఎటాచ్ చేసినట్లు తెలుస్తుంది.

వీటిలో ముంబై, సూరత్ ప్రాంతాలలో వున్న విలువైన ప్రాపర్టీస్, ఫ్లాట్స్, కార్లని స్వాదీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.మరో వైపు నీరవ్ మోదీ ఆస్తులని స్వాదీనం చేసుకుంటున్న ఈడీ అతనిని ఇండియా రప్పించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube