తమిళ యంగ్ హీరో విశాల్ నటించే సినిమాలకు టాలీవుడ్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.ఆయన నటించే సినిమాలు ఇక్కడ కూడా సంచలన విజయాలు అందుకోవడం మనం చూశాం.
ఇక విశాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఎనిమీ’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.ఈ సినిమాలో విశాల్ హీరోగా నటిస్తుండగా, మరో హీరో ఆర్య విలన్ పాత్రలో నటిస్తున్నాడు.
ఈ కాంబోలో సినిమా వస్తుండటంతో తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.గతంలో వీరిద్దరి కాంబోలో ‘వాడు వీడు’ అనే సినిమా రాగా, లుగు ప్రేక్షకులకు ఆ చిత్రం బాగా నచ్చిన సంగతి తెలిసిందే.
దీంతో మరోసారి విశాల్, ఆర్యలు కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో ‘ఎనిమీ’ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రయేట అయ్యాయి.ఇక ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తుండగా, ఈ సినిమాను దసరా బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
దీనికి సంబంధించి తాజాగా ఓ పోస్టర్ను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.ఆయుధ పూజ చేసేందుకు ఎనిమీ రెడీ అవుతున్నాడని చిత్ర యూనిట్ పేర్కొంది.దసరా సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ భారీ ఏర్పాట్లు చేస్తోంది.
ఇక ఈ సినిమాలో విశాల్, ఆర్య పర్ఫార్మెన్స్లు మరో లెవెల్లో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్, టీజర్లు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయడంతో ఎనిమీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.మరి ఎనిమీ చిత్రం ఎలాంటి కథతో వస్తుందా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే ఆయుధ పూజ చేసే రోజు వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.