ఎవరో చెప్పిన మాటలకు బావోద్వేగానికి గురై సమ్మె నిర్ణయం తీసుకోవద్దు.ఉద్యోగుల పట్ల సానుభూతి లేకపోతే అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్ ఎందుకు ఇస్తారు.? ఉద్యోగుల్ని కన్న బిడ్డలా చూసుకోవాలని మా ప్రభుత్వం అనుకుంటుంది.మీ కోరికలు తీర్చలేకపోతునందుకు సీఎం జగన్ చాలా బాధ పడుతున్నారు.
ఇలాంటి సందర్భంలో కొంతమంది రాజకీయ లబ్ది కోసం మాట్లాడుతున్నారు.ఉద్యోగుల ఆందోళనలు క్యాష్ చేసుకోడానికి కొందరు గోతికాడ నక్కలా చూస్తున్నారు.
ఉద్యోగుల పట్ల ముసలి కన్నీళ్లు కురుస్తున్న వారు గతంలో మిమ్మల్ని ఎలా చూసారో ఆలోచించాలి.
టీడీపీ, బీజేపీ,జనసేన కలిసి ఐదేళ్లు పాలించి ఒక్క ప్రభుత్వ ఉద్యోగం అయినా ఇచ్చారా.? కోవిడ్ తో వ్యవస్థ మొత్తం తల్లడిల్లుతుంది.2020 లో 62 వేల కోట్లు ఆదాయం రావాల్సి ఉంటే 60 వేల కోట్లు వచ్చింది…2021 లో 82 వేల కోట్లు రావాల్సి ఉంటే 60 వేల కోట్లు రాబడి వచ్చింది.కోవిడ్ కోసం ఇప్పటివరకు 30 వేల కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం.కేంద్రం నుండి రావాల్సిన వాటాలు భారీగా పడిపోతున్నాయి. కొత్త పీఆర్సీ వల్ల 10 వేల కోట్లు అధికంగా చెల్లింపులు పెరిగాయి.