తెలుగు బుల్లితెర పై బాగా సక్సెస్ఫుల్ అయిన ప్రోగ్రాం ఏదైనా ఉంది అంటే అది జబర్దస్త్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది ఈ ప్రోగ్రాం.
ఏడు సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఈ షో జరుగుతూనే ఉంది.ఈ షో నుండి ఎంతో మంది టాలీవుడ్ రంగానికి పరిచయం అయ్యారు కూడా.
టాలీవుడ్ కు కమెడియన్ల కొరత లేకుండా ఎంతో మంది ఇండస్ట్రీకి వచ్చి వారి టాలెంట్ ను నిరూపించుకున్నారు.ఇలా జబర్దస్త్ నుంచి వచ్చిన వారు కేవలంకమెడియన్స్ మాత్రమే కాకుండా హీరోలకు కూడా ఎదిగారు.
అంతేకాదు ఈ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ కూడా వారి జీవితాలలో ఆర్థికంగా బాగా స్థిరపడ్డారు.ప్రస్తుతం బుల్లితెర పై అనేక సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నడుస్తున్న సుడిగాలి సుదీర్ అలాగే ఈ కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయిన హైపర్ ఆది లాంటి వారు కూడా ఎందరో ఉన్నారు.
ఇక అసలు విషయంలోకి వెళితే.
సుడిగాలి సుదీర్ జీవితానికి ఓ టర్నింగ్ పాయింట్ జబర్దస్త్ అని చెప్పవచ్చు.తాజాగా జబర్దస్త్ కామెడీ షో 400 ఎపిసోడ్ ని పూర్తి చేసుకుంది.ఈ కార్యక్రమంలో భాగంగా కంటి డిస్టెన్స్ వారి ఇదివరకు రోజులను గుర్తు చేసుకుని జబర్దస్త్ స్టేజిపై అందరిని కన్నీరు పెట్టించారు.
ఈ జబర్దస్త్ కార్యక్రమం లో అందరి కంటే ముందుగా చెప్పుకోవాల్సింది జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చేస్తున్న కంటెస్టెంట్ రాకెట్ రాఘవ.ఈ సందర్భంగా రాకెట్ రాఘవ షో జడ్జీలు రోజా, మనో ఆయనను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ టీం లీడర్ అయిన వెంకీ మాట్లాడుతూ.తనను ఇదివరకు తమ వారు కాదన్న వారే ఇప్పుడు వారే తనను మావాడే అంటున్నారని చెప్పుకొచ్చాడు.
దాంతోపాటు తాను సక్సెస్ లో లేనప్పుడు నువ్వు బాగా చేస్తావ్ అని చెప్పిన నాన్న ప్రస్తుతం తన సక్సెస్ అయ్యాక తన దగ్గర లోడు అంటూ బోరున విలపించాడు.
ఆ తర్వాత హైపర్ ఆది మాట్లాడుతూ.4 సంవత్సరాల క్రితం తన చేతిలో వంద రూపాయలు కూడా సరిగా ఉండేవి కావని, తినడానికి కూడా తిండి దొరకక కొద్దిరోజులు కష్టపడ్డామని అలాంటిది ఇప్పుడు తన కుటుంబానికి ఓ స్టేటస్ వచ్చిందని అది పూర్తిగా జబర్దస్త్ పుణ్యమే అని చెప్పుకొచ్చాడు.తన జీవితంలో అభి అన్న లేకపోతే తాను లేనట్టు మరోసారి తన గురుభక్తిని హైపర్ ఆది చాటుకున్నాడు.
వీటితోపాటు జడ్జి రోజా అలాగే యాంకర్ అనసూయ కూడా వారికి సంబంధించిన మధురానుభూతులను ఈ కార్యక్రమంలో పంచుకున్నారు.వారి అనుభవాలు చెప్పుకోవడంతో అందరూ ఒకింత ఎమోషనల్ కు గురయ్యారు.