గత ఏడాది నుంచి కరోనా వైరస్ విజృంభణ వలన ఎన్నో సమస్యలు తలెత్తాయి.ఆర్థికంగా కాకుండా.
ప్రాణ నష్టాలు కూడా జరిగాయి.ఎన్నో పనులు, కార్యక్రమాలు అన్ని ఆగిపోయాయి.
అంతే కాకుండా ఎంతో మంది వివాహాలు వాయిదా పడ్డాయి.కొంతమంది పెళ్లిళ్లు అతికొద్ది సమక్షంలోనే జరిగాయి.
ఇలా ఎన్నో సంఘటనలు ఎదురుగా కాగా.ఓ పెళ్లి కొడుకు పెళ్లి పందిట్లో కన్నీరు పెట్టుకున్న విషయం చోటు చేసుకుంది.
హైదరాబాద్ సంతోష్ నగర్ కు చెందిన మహమ్మద్ ఇమ్దాద్.ఇతను జెడ్డాలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు.
గత ఏడాదిలో ఇతడికి పెళ్లి నిశ్చయం కాగా కుటుంబ బంధువుల సమక్షంలో జెడ్డా లో జరుపుకోవాలని నిశ్చయించుకున్నాడు.గత ఏడాది మార్చిలో పెళ్లి డేట్ ఫిక్స్ కాగా కరోనా లాక్ డౌన్ వల్ల అతని పెళ్లి వాయిదా పడింది.
ఇటీవలే ఆయన పెళ్లి ఆలస్యం అవుతుందనే ఆలోచనతో ఇరు కుటుంబాల పెద్దలు లేకుండానే పెళ్లి జరిగింది.
తన తండ్రి హైదరాబాద్ లో ఉన్నందున జెడ్డా లో తన పెళ్ళికి రానందుకు భావోద్వేగానికి గురయ్యాడు.కరోనా లాక్ డౌన్ వల్ల జెడ్డా కు వెళ్లలేకపోయారు అతని తల్లిదండ్రులు.అంతేకాకుండా వాళ్ళు ఇప్పటికికూడా వీసా అందలేనందున.
మరింత ఆలస్యం కావడంతో పెళ్లి జరిగిపోయింది.దీంతో తన పెళ్ళికి తల్లిదండ్రులు లేకపోయేసరికి.
వాళ్లను గుర్తుచేసుకొని కన్నీరు పెట్టుకున్నాడు.
ఇలా ఎంతో మంది వివాహాలు ఘనంగా చేసుకుందామని అనుకోగా.
ఈ వైరస్ విజృంభణ వలన జీవితంలో ఒక్కసారి చేసుకునే పెళ్లి.అతి కొద్ది మంది సమక్షంలో తక్కువ సందడితో జరిగిపోతున్నాయి.
దీని వల్ల ఎంతో మంది తమ సొంత కుటుంబాలు తమ పెళ్లిళ్లకు హాజరు కాలేక పోతున్నారు.ఇప్పటికీ పలు చోట్ల కొన్ని కార్యాలు అతి కొద్దిమంది సమక్షంలోనే జరుగుతున్నాయి.