ఎలోన్ మస్క్ ప్రపంచ కుబేరుల్లో ఒకరు.ఆయన తరుచూ వార్తల్లో ఉంటారు.
మస్క్ చేసే ప్రతి ట్వీట్లు ఎప్పుడు సంచలనాలు సృష్టిస్తుంటాయి.బుధవారం అలాంటి ట్వీటే చేశారు టెస్లా అధినేత ఎలోన్ మస్క్.
.ప్రముఖ ఫుట్ బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ ని కొనుగోలు చేస్తున్నట్లు ట్వీట్ చేశాడు.‘నేను మాంచెస్టర్ యునైటెడ్ కొనుగోలు చేస్తున్నాను.మీకు స్వాగతం’ అంటూ ట్వీట్ లో రాసుకొచ్చాడు.అయితే ఈ డీల్ పై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.ఈ డీల్ తో తాను ఏమీ కొనసాగించాలనుకుంటున్నాడో కూడా మస్క్ చెప్పలేదు.
ప్రస్తుతం ఈ క్లబ్ అమెరికన్ గ్లేజర్ కుటుంబ ఆధీనంలో ఉంది.మంగళవారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్ బాల్ క్లబ్ 2.08 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ను కలిగి ఉంది.ఇటీవల అమెరికన్ గ్లేజర్స్ కి వ్యతిరేకంగా అభిమానులు నిరసనలు చేశారు.
అయితే ఎలోన్ మస్క్ ప్రకటించినట్లుగానే మాంచెస్టర్ యునైటెడ్ ని కొనుగోలు చేస్తారా? లేదా అనేది వేచి చూడాల్సిందే.ఎలోన్ మస్క్ ప్రస్తుతం ట్విట్టర్ తో ఒప్పందాన్ని తెంచుకుని కోర్టు చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే.44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ ని కొనుగోలు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.అయితే తర్వాత ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు.