జాతీయ, అంతర్జాతీయ విషయాలను నిరంతరం ఫాలో అయ్యే వారికి ఎలన్ మస్క్ పరిచయం అక్కరలేని పేరు.స్పేస్ ఎక్స్ కంపెనీని స్థాపించి రోదసి పైకి వెళ్లి అక్కడ చేయవలసిన రకరకాల విషయాలపై పరిశోధనలు చేస్తున్న వ్యక్తి ఎలన్మస్క్.
అంతేకాక ఇటీవల ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే.అయితే అత్యంత శక్తి వంతమైన వ్యక్తి అనేది వాట్సాప్ నూతన రూల్స్ తీసుకొస్తున్నప్పుడు జరుగుతున్న వివాదం సమయంలో ప్రపంచానికి తెలిసింది.
వాట్సాప్ తీసుకున్న నూతన రూల్స్ వల్ల యూజర్స్ గొప్యతకు భంగం కలుగుతుందని భావించిన ఎలాన్ తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో యూజ్ సిగ్నల్ అని చేసిన ఒక్క ట్వీట్ తో సిగ్నల్ యాప్ డౌన్ లోడ్స్ పెరిగి సర్వర్లు క్రాష్ అయిన పరిస్థితి ఉందంటే ఎలాన్ మస్క్ ప్రభావం ఎంతటిదో మనం అర్థం చేసుకోవచ్చు.అయితే ఎలన్ మస్క్ టెస్లా కార్లు ఎంత ఫెమస్ అనేవి మనకు తెలిసిందే.
అయితే ఈ టెస్లా కార్లకు సంబంధించి చైనా బ్యాన్ చేసినట్టు ప్రకటించింది.టెస్లా కార్లకు ఉన్న ప్రత్యేక కెమెరాలతో చైనా నిఘా వ్యవస్థకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించింది.
అయితే చైనా వ్యాఖ్యలపై ఎలన్ మస్క్ ఘాటుగా స్పందించాడు.టెస్లా కార్లతో ప్రమాదం ఉందని నిరూపిస్తే టెస్లా కంపెనీని మూసివేస్తానని ప్రకటించాడు.