గత ఏడాది నుంచి ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపించి ఎన్నో నష్టాలు కలిగించిన సంగతి తెలిసిందే.వైరస్ విజృంభణ ముందు ఉన్న ప్రపంచం ఇక రాదంటూ, మళ్లీ చూడలేమంటూ సోషల్ మీడియాలో పలు రకాల పోస్టులు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే వైరస్ సోకిన వ్యక్తి భయంతో కొట్టుమిట్టాడుతుంటే.ఇక్కడ కరోనా సోకిన ఓ మహిళ చేసిన పోస్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
కాలిఫోర్నియా కు చెందిన ఓ బిలియనీర్ ఎలన్ మాస్క్.అతను ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ లో మొదటి స్థానంలో నిలిచిన వ్యక్తి.ఇతని ప్రియురాలు పేరు గ్రైమ్స్.ఈమె వయసు 32 ఏళ్లు.
తను ఓ సింగర్.వాళ్లకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు.
కాగా ఇటీవలే తనకు కరోనా వైరస్ సోకింది.కాగా ఆ విషయం గురించి తను ఓ వింత పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఆమెకు కరోనా సోకిందనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలిపింది.కాగా తను చేసిన ఓ పోస్ట్ ఎట్టకేలకు నాకు కరోనా వచ్చింది.కానీ వింత ఏంటంటే.ఆ వైరస్ వల్ల నేను ఎంజాయ్ చేస్తున్నా అని సోషల్ మీడియాలో తన ఇన్ స్టాలో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.
అంతే కాకుండా ఆ పోస్ట్ లో గుడ్ డేస్ అనే పాటను షేర్ చేసి ఈ పాట చాలా బాగుందని తెలిపింది.అంతేకాకుండా తను షేర్ చేసిన పోస్ట్ లో తన కుమారుడి ఫోటో కూడా ఉంది.
కాగా ఈ పోస్ట్ కు నేటి జనులు విపరీతమైన కామెంట్లను పెడుతున్నారు.