అన్నమయ్య జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి.సుండుపల్లె మండలంలో పంట పొలాలను గజరాజుల ధ్వంసం చేశాయి.
అదేవిధంగా రాయవరం, కలవలపల్లిలో మామిడి తోటలను ధ్వంసం చేశాయి.గజరాజుల గుంపుల దాడిలో పంట పొలాల వద్ద ఉన్న మోటార్లు, పైపులు కూడా నాశనం అయ్యాయని రైతులు వాపోతున్నారు.
అనంతరం అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు.