మనుషులకు మాట్లాడడానికి నోరు ఉంది.మనకు ఏదైనా బాధ వచ్చిన సంతోషం వచ్చినా నోటితో చెబుతాం.
కానీ మూగజీవాలకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా బయటకు చెప్పలేవు.ఎందుకంటే వారికి మాటలు రావు.
మూగజీవాలకు సంతోషం వచ్చినా కూడా బయటికి వ్యక్తపరచ లేవు.మూగ జీవాలపై మనము ప్రేమ చూపించ లేక పోయినా పర్వాలేదు కానీ మూగజీవాల పట్ల కరుణ చూపితే చాలు.
రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్ ఏనుగును చూసుకున్న అంత మురిపెంగా చూసుకోక పోయినా పర్వాలేదు కానీ వాటిని కొట్టడం, రాళ్లతో విసరడం ఇలాంటి మాత్రం చేయకూడదు.వాటి మానాన వాటిని బతకనిస్తే చాలు.
ఇంకా సమయం ఉంటే వాటి ప్రేమ అర్థం చేసుకోవడానికి వాటి బాధను అర్థం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నించాలి.ఒక వ్యక్తి ఒక ఏనుగు ని కాల్చి చంపిన ఘటన గురించి తెలుసుకుందాం.
తమిళనాడులో ఒక వ్యక్తి 40 ఏళ్ల ఏనుగు విషయంలో క్రూరంగా ప్రవర్తించాడు.ఏనుగు వస్తే కర్రతో కొట్టి దూరంగా పంపాల్సిందీ పోయి దాని పట్ల గోరంగా ప్రవర్తించాడు.ఆ ఏనుగు ని తరిమికొట్టే తరుణంలో ఒక టైరు కి నిప్పు అంటించి ఏనుగు మీదికి విసిరాడు.ఆ టైర్లు ఏనుగు చెవికి చిక్కుకుంది.దీనితో ఆ ఏనుగు చెవి తో పాటు వెనుక వీపు భాగం అంత కాలిపోయింది.
నిప్పుతో ఉన్న టైర్ ఏనుగు మీద పడటంతో ఏనుగు ఒక్కసారిగా బిత్తరపోయింది.
అలా పడటంతో ఏం చేయాలి అని తెలియక ఏనుగు హడలి పోవడంతో మిగతా భాగం అంతా కాలిపోయింది.ఈ ఘటన మాసినగూడ లోని నీలగిరి ప్రాంతంలో జరిగింది.
ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్లో హల్ చల్ గా మారింది.ఈ వీడియో అటవీశాఖ అధికారులు కంట పడింది.
వారు అక్కడికి చేరుకొని గాయపడ్డ ఏనుగును చికిత్స కోసం తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది.ఇంతటి ఘోరానికి కారణమైన ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు అటవీశాఖ అధికారులు.
ఇద్దరు దొరికారు మూడో వ్యక్తి పరారీలో ఉన్నట్లు అతనిని కూడా తొందరలోనే పట్టుకుంటాం అని తెలిపారు.