నేటికాలంలో సమాజంలో అసలు విలువ లేనిది ఏంటంటే ఒక మనిషి ప్రాణం.ప్రతి దానికి వెలకడుతున్న ఈ లోకంలో ఆ ధరను నిర్ణయించే మనిషి బ్రతుక్కే విలువ లేకుండా పోతుంది.
ఎప్పుడు ఆగిపోతుందో తెలియని ఊపిరి కోసం మనిషి ప్రాకులాడుతూ తన ఉనికిని తానే మాయం చేసుకుంటున్నాడు.
ఇక లోకంలో ఎవరికి చెప్పకుండా వచ్చేది చావు.
ఎంతటి వారికైనా ఈ మరణం అనేది తప్పదు.పాపం ఒక వ్యక్తి ఆనందంగా సాగిస్తున్న తన ప్రయాణంలో యమపాశం వెంటాడి వెంటాడి అతని ప్రాణాలను హరించి వేసింది.
ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకుంటే.
దుండిగల్ మున్సిపల్ పరిధి డీపోచంపల్లికి చెందిన అక్బర్ ఖాన్(38) ఎలక్ట్రీషియన్ శనివారం రాత్రి ఔటర్ నుంచి దుండిగల్ వైపు వెళ్లుతుండగా, అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చాయట.
దీంతో కంట్రోల్ తప్పిన కారు పక్కనే ఉన్న ఓపెన్ ప్లాట్ గోడను ఢీకొందట.
ఈ ప్రమాదంలో అతని తలకు గట్టిగా దెబ్బతాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడట.
ఈ ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారట.