ఏపీలో ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు దూసుకుపోతున్నాయి.ఎవరికి వారు తమ సత్తా పరీక్షించుకునే పనిలో ప్రస్తుతం ఉన్నారు.
ఇదిలా ఉంటే ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఎన్నికల నిర్వహణపై ద్రుష్టి పెట్టింది.తాజా ఏపీ ఎన్నికల అధికారి తాజాగా ఏపీలో ఓటర్ల జాబితాని ప్రకటించారు.
ప్రస్తుతం ఏపీలో మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల ఓటర్లు ఉన్నాయని తెలియజేసారు.
జనవరి నుంచి ఇప్పటి వరకు కొత్తగా 15 లక్షలు ఓట్లు పెరిగాయని, అదే సమయంలో లక్ష ఏభై ఐదు వేలు ఓట్లు తొలగించడం జరిగింది అని ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలియజేసారు.
ఓట్లు తొలగించాలని వచ్చిన దరఖాస్తులలో పది లక్షల వరకు పరిశీలించాల్సి ఉందని చెప్పుకొచ్చారు.అలాగే డీజీపీని మార్చాలని వైసీపీ అభ్యర్ధనపై ఇన్నాతదికారుల ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసారు.