ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సమయం ఆసన్నం అవుతున్న నేపధ్యంలో నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది.అంతే కాకుండా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు రంగంలోకి ఈ పంచాయితీ ఎన్నికల్లో గెలవడానికి తమ బుర్రలకు పదును పెడుతున్నారట.
అంటే ఓటర్లను ఎలా లొంగదీసు కోవాలనే ఆలోచనలో భాగంగా పావులు కదుపుతున్నారట.బుర్రలు తక్కువగా ఉన్న ఓటర్లను ఏ రకంగా అయినా బుట్టలో వేసుకోవచ్చన్న విషయం తెలిసిన నాయకులు ఓడినట్లు చరిత్రలో లేదని అనుకుంటున్నారట కొందరు.
ఇకపోతే ఏపీలోని చాలా గ్రామాల్లో గ్రామాభివృద్ధికి డబ్బులు ఇస్తామని అభ్యర్థులు ముందుకు రావడం తో అక్కడ సర్పంచ్ పదవి ఏకగ్రీవం అవుతోందట.మరికొన్ని చోట్ల అయితే పదవి కోసం వేలం పాటలు కూడా నిర్వహిస్తున్నారట.
ఆ వేలంలో ఎవరు ఎక్కువ పాడితే వారిని ఏకగ్రీవం చేస్తున్నారట ప్రజలు.
ఇదిలా ఉండగా కడప జిల్లా కమలాపురం మండలంలోని ఓ గ్రామంలో మాత్రం సర్పంచ్ పదవి జనరల్కు కేటాయించారు.అయితే తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ.20 లక్షలు ఇస్తానని ఆ వ్యక్తి ఆఫర్ ఇచ్చాడట.అయితే, ఈ సొమ్ములో నుండి ఒక్కో ఓటరుకు రూ.8 వేల చొప్పున పంచాలని ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది.మరి ఇంకేం అభివృద్ధి జరుగుతుంది ఆ గ్రామంలో ఆ ఓటర్లకే తెలియాలంటున్నారు ఈ విషయం తెలిసిన వారు.