ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా అక్కడక్కడ మాత్రం అసంతృప్తి సెగలు రగులుతూనే ఉన్నాయట.ప్రజల్లో నిండుకున్న ఈ అసంతృప్తి కారణంగా వైసీపీ ఎక్కువ పంచాయతీలలో ఓడిపోయిందని ప్రచారం జరుగుతుంది.
ఇదిలా ఉండగా 108 పంచాయతీలు ఉన్న ఆలూరు అసెంబ్లీ నియోజక వర్గంలో 11 చోట్లే వైసీపీ అనుచరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.కాగా ఎన్నికలు జరిగిన 97 పంచాయతీలలో 67 వైసీపీ ఖాతాలో పడగా, టీడీపీ 27 చోట్ల గెలిచింది.
ఇక వైసీపీ గెలుపొందిన 67 లో దాదాపు 15 స్థానాలు వైసీపీ రెబల్స్ గెలుచుకోగా, మూడు చోట్ల ఇతరులు సత్తా చాటారు.ఇకపోతే గుమ్మనూరు పంచాయతీ వైసీపీ మంత్రి జయరాం సొంతూరు.
ఇక్కడ ఈయన ఏకగ్రీవంగా గెలుపొందినా ఆయన నివాసం ఉండే ఆలూరు మేజర్ పంచాయితీని మాత్రం గెలిపించుకో లేక పోయారు.దీన్ని బట్టి చూస్తుంటే ఈయన పంచాయితీలో టీడీపీ మెల్లగా పాగా వేస్తున్నట్లేగా అనే అనుమానాలు బలపడుతున్నాయట.