ఆ మంత్రి గారి నియోజకవర్గంలో టీడీపీ పాగా.. ఏపీలో కొత్త ట్విస్ట్.. ?

ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా అక్కడక్కడ మాత్రం అసంతృప్తి సెగలు రగులుతూనే ఉన్నాయట.ప్రజల్లో నిండుకున్న ఈ అసంతృప్తి కారణంగా వైసీపీ ఎక్కువ పంచాయతీలలో ఓడిపోయిందని ప్రచారం జరుగుతుంది.

 Election Results In Minister Gummanur Jayaram Constituency Panchayat Election, Y-TeluguStop.com

ఇదిలా ఉండగా 108 పంచాయతీలు ఉన్న ఆలూరు అసెంబ్లీ నియోజక వర్గంలో 11 చోట్లే వైసీపీ అనుచరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.కాగా ఎన్నికలు జరిగిన 97 పంచాయతీలలో 67 వైసీపీ ఖాతాలో పడగా, టీడీపీ 27 చోట్ల గెలిచింది.

ఇక వైసీపీ గెలుపొందిన 67  లో దాదాపు 15 స్థానాలు వైసీపీ రెబల్స్‌ గెలుచుకోగా, మూడు చోట్ల ఇతరులు సత్తా చాటారు.ఇకపోతే గుమ్మనూరు పంచాయతీ వైసీపీ మంత్రి జయరాం సొంతూరు.

ఇక్కడ ఈయన ఏకగ్రీవంగా గెలుపొందినా ఆయన నివాసం ఉండే ఆలూరు మేజర్‌ పంచాయితీని మాత్రం గెలిపించుకో లేక పోయారు.దీన్ని బట్టి చూస్తుంటే ఈయన పంచాయితీలో టీడీపీ మెల్లగా పాగా వేస్తున్నట్లేగా అనే అనుమానాలు బలపడుతున్నాయట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube