రాజకీయ పార్టీలు విస్తృత ఎన్నికల ప్రచారం తర్వాత ప్రజా తీర్పుకి సమయం వచ్చేసింది.తొలి దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభంకానుంది.
ఏపీ, తెలంగాణతోపాటు 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 91 లోక్సభ నియోజకవర్గాలలో పోలింగ్ కి రంగం సిద్ధం అయ్యింది తొలి దశలో మొత్తం 1280మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా, ఏపీ అసెంబ్లీ బరిలో 2395మంది పోటీ పడుతున్నారు.
ఏపీ, తెలంగాణతో పాటు మొత్తం 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 91 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రారంభం అయ్యింది.
ఏపీలో 25, అరుణాచల్లో 2, అసోంలో 5, బీహార్లో 4, ఛత్తీస్గఢ్లో 1, జమ్మూకశ్మీర్లో 2, మహారాష్ట్రలో 7, మణిపూర్లో 1, మేఘాలయలో 2, మిజోరాంలో 1, నాగాలాండ్లో 1, ఒడిషాలో 4, సిక్కింలో 1, తెలంగాణలో 17, త్రిపురలో 1, ఉత్తరప్రదేశ్లో 8, ఉత్తరాఖండ్లో 5, పశ్చిమబెంగాల్లో 2, అండమాన్ నికోబార్లో 1, లక్షద్వీప్ 1 ఇలా మొదటి దశలో మొత్తం 91 పార్లమెంట్ స్థానాలకు ఓటింగ్ జరగనుంది.ముఖ్యంగా ఏపీలో పోలింగ్ లో ఓటింగ్ శాతం ప్రాంతీయ పార్టీల గెలుపు ఓటములని నిర్ణయిస్తాయి.