ఫిలింనగర్ కల్చరల్ సెంటర్కు అధ్యక్షుడిగా ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గెలుపొందారు.ఎఫ్ఎన్సీసీలో ఎన్నికలు జరిగిన అనంతరం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో ఆదిశేషగిరిరావు అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా తుమ్మల రంగరావు ఎన్నికైనట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
రెండు సంవత్సరాలకు ఒకసారి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునే అవకాశం ఉంటుంది.
ఎఫ్ఎన్సీసీలో మొత్తం 4,600 మంది సభ్యులుండగా, అందులో 1,900 మందికి మాత్రమే ఓటు హక్కు ఉంది.
కార్యదర్శిగా ముళ్లపూడి మోహన్, ఉపాధ్యక్షుడిగా తుమ్మల రంగారావు, కోశాధికారిగా రాజశేఖర్రెడ్డి, జాయింట్ సెక్రటరీగా వీవీఎస్ఎస్ పెద్దిరాజు ఎన్నికయ్యారు.అదేవిధంగా ఏడిద రాజా, ఇంద్రపాల్రెడ్డి, వడ్లపట్ల మోహన్, సీహెచ్ వర ప్రసాదరావు, శైలజ, కాజా సూర్యనారాయణ, దర్శకుడు మురళీమోహన్, బాలరాజు, గోపాలరావు కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.