ఏదో ఒకరకంగా… ఓటర్లను బుట్టలో వేసుకుని మళ్ళీ అధికారంలోకి వచ్చేయాలని టీడీపీ ఆలోచన చేస్తోంది.అందుకే రకరకాల పేర్లతో సరికొత్త పథకాలకు ఉపకల్పన చేసి గట్టెక్కాలని చూస్తోంది.
దీనిలో భాగంగానే… తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు పథకాన్ని ఏపీలోనూ అమలు చేసేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.దీనికి సంబంధించి విధివిథానాలపై చంద్రబాబు సర్కారు కసరత్తు చేస్తోంది.
ఈ పథకానికి అన్నదాత సుఖీభవ పేరు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉందని విశ్వసనీయంగా తెలిసింది.దీనికి రైతురక్ష, రైతుసురక్ష పేర్లు అనుకున్నప్పటికి చివరికి అన్నదాత సుఖీభవ పేరు ఫైనల్ చేశారు.
టీడీపీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే రానున్న ఖరీఫ్ సీజన్ నుంచి అంటే జూన్ 1వ తేదీ నుంచి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలనీ చూస్తోంది.ఇప్పటికిప్పుడు ఈ పథకాన్ని అమలు చేసేందుకు సాధ్యం కాకపోయినా ఎన్నికల్లో దీన్నొక ప్రచార అస్త్రంగా వాడుకుని వచ్చే ఖరీఫ్ నుంచి అమలు చేసేందుకు చంద్రబాబు భావిస్తున్నారు.దీనికి అన్నదాత సుఖీభవ పేరును పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది.ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలన్న దానిపై పార్టీ ముఖ్య నేతలతో బాబు సమాలోచనలు చేస్తున్నాడు.