ప్రజాశాంతి పార్టీ తో ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తనదైన ప్రచారంతో హడావిడి చేస్తున్న వ్యక్తి కేఏ పాల్.రానున్న ఎన్నికల్లో తన పార్టీ అధికారంలోకి వస్తుందని, ఏపీలో మొత్తం క్లీన్ స్వీప్ చేయబోతున్నామని, ప్రతిరోజు మీడియా చానల్స్ లో హడావిడి చేస్తున్న కెఎ పాల్ కు ఎలక్షన్ కమిషన్ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది అని చెప్పాలి.
తెలుగుదేశం, వైసిపి, జనసేన పార్టీలను అదే పనిగా విమర్శిస్తూ హడావిడి చేస్తున్న కే ఏ పాల్ మీడియా చానల్స్ కూడా పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ కోసం ఉపయోగించుకుంటున్నాయి అని చెప్పాలి.
కొద్ది రోజుల క్రితం కేఏ పాల్ కు ఎలక్షన్ కమిషన్ హెలికాప్టర్ గుర్తుగా ఇచ్చింది.
అయితే ఈ ఎన్నికల గుర్తుపై వైసిపి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో తాజాగా ప్రజా సమితి పార్టీ ఎన్నికల గుర్తు అయినా హెలికాప్టర్ గుర్తు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.మరొక గుర్తుకు దరఖాస్తు చేసుకోవాలని ఎలక్షన్ కమిషన్ ప్రజా సొంత పార్టీకి తెలియజేసినట్లు తెలుస్తుంది.