తాజాగా యువీ కాన్సెప్ట్స్ బ్యానర్లో సంతోష్ శోభన్ హీరోగా అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఏక్ మినీ కథ.బోల్డ్ కంటెంట్ తో అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని డిజిటల్ ఆడియన్స్ ని మెప్పించింది.
తెలుగులో ఇప్పటి వరకు రానటువంటి డిఫరెంట్ కథాంశంతో మొదటిసారి ఈ సినిమాని తెరకెక్కించారు.మేర్లపాక గాంధీ అందించిన కథతో కార్తీక్ రాపోలు దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది.
దర్శకుడిగా మొదటి సినిమానే బోల్డ్ కాన్సెప్ట్ ఎంచుకున్న కూడా ఎక్కడ ఇలాంటి వల్గారిటీ లేకుండా క్లీన్ కామెడీని తెరపై ఆవిష్కరించిన డైరెక్టర్ కార్తీక్ కి మంచి గుర్తింపు వచ్చింది.మొదటి ప్రయత్నంలో సక్సెస్ అందుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకున్న ఈ యంగ్ దర్శకుడికి ఇప్పుడు నిర్మాతల నుంచి అదిరిపోయే ఆఫర్స్ వస్తున్నాయి.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఇప్పటికే కార్తీక్ రాపోలుతో ఓ సినిమా చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తుంది.అలాగే గీతాఆర్ట్స్ బ్యానర్ కూడా కార్తీక్ తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్లో మరో చిత్రం ఆఫర్ కూడా కార్తీక్ సొంతం చేసుకున్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్.మొత్తానికి మొదటి చిత్రం హిట్ తో కార్తీక్ రాపోలు ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ దర్శకుడిగా మారిపోయాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోగా నటించిన సంతోష్ శోభన్ కూడా ఏకంగా మూడు సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తోంది.అందులో నందినిరెడ్డి దర్శకత్వంలో కూడా ఒక మూవీ తెరకెక్కనుంది.అలాగే ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన కావ్య థాపర్ కి మంచి అవకాశాలు వస్తున్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట.మొత్తానికి ఒక సినిమాతో ఇప్పుడు దర్శకుడు హీరోల భవిష్యత్తు ఒక్కసారిగా తీసుకోవడం ఏక్ మినీ కథతో సాధ్యమైందని చెప్పాలి.