కొందరు సరదాగా అంటూ చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఉంటారు.అవతలి వారినికి ఇబ్బంది అనే విషయం గుర్తించకుండా తమ సరదా కోసం అసాంఫీుక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు.
ఈజిప్ట్లో జరిగిన ఒక సంఘటన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.మూడు నెలల క్రితం ఆమె చేసిన సరదా పనికి తాజాగా అక్కడి కోర్టు శిక్ష విధించింది.
ఆమె చేసిన పనికి మంచి పని అయ్యిందని స్థానికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అసలు విషయం ఏంటీ అంటే… ఈజిప్ట్లోని మన్సౌరాకు చెందిన ఒక మహిళ మూడు నెలల క్రితం ఒక కోతితో ఆడుకుంటూ వీడియో తీయించుకుంది.
ఆమె మామూలుగా ఆడుకుంటే ఇప్పుడు మనం ఆమె గురించి మాట్లాడుకునే అవకాశం వచ్చేది కాదు.కాని ఆమె ఆ కోతి మర్మాంగంను పట్టుకుని, కదుపుతూ, దానిపై జోకులు వేస్తూ ఆ కోతిని ఇబ్బందికి గురి చేసింది.
ఆ కోతి పారిపోయేందుకు ప్రయత్నించినా కూడా బలవంతంగా పట్టుకుని మర్మాంగంను పట్టుకుని అసభ్యంగా మాట్లాడుతూ కోతుల శృంగారం గురించి ఆ మర్మాంగం సాయంతో వివరించడం మొదలు పెట్టింది.
ఆ మహిళ చేసిన పని గొప్పదన్నట్లు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఆ వీడియో కాస్త వైరల్ అయ్యి, జంతు ప్రేమికుల మనసు నొచ్చుకునేలా చేసింది.దాంతో ఆమెపై జంతు ప్రేమికులు కేసు పెట్టారు.
మూడు నెలల విచారణ తర్వాత కోర్టు ఆమెకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.అయితే ఆమె చేసిన పనికి అంత తక్కువ శిక్ష వేయడం విచిత్రంగా ఉందని, కనీసం అయిదు సంవత్సరాలు అయినా జైలు శిక్ష విధించాల్సిందే అని, అలా చేస్తేనే మరెవ్వరు అలాంటి చర్యలకు పాల్పడరు అంటూ జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.
ఆమె సరదాగా చేసిన పని ఇంత పెద్ద రచ్చకు దారి తీసింది.ఆమె క్షమాపణ చెప్పినా కూడా ఫలితం లేకుండా పోయింది.ఆమెకు పడ్డ శిక్షపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలపండి.