ఈజిప్టు వరుస ప్రమాదాలకు నిలయంగా మారుతున్నట్లుగా కనిపిస్తుంది.కాగా గత నెలలో ఈజిప్టు లో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 32 మంది మృతి చెందగా, 165 మంది గాయపడిన ఘటన మరవక ముందే తాజాగా మరో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది.
ఈజిప్టు రాజధాని కైరో నుంచి బయలుదేరిన రైలు పట్టాలు తప్పిన ఘటనలో 11 మంది మృతి చెందగా, మరో 98 మంది గాయపడ్డారని అక్కడి అధికారులు వెల్లడించారట.ఇక గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇకపోతే ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక బృందాలు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాయి.కాగా ఈ సహాయక చర్యల్లో 50 కిపైగా అంబులెన్స్లు పాలుపంచుకున్నట్లుగా, క్షతగాత్రుల్లో ఎక్కువమంది చిన్నారులు ఉన్నట్టు స్థానిక మీడియా కధనం.
అయితే రాజధాని కైరో నుంచి మన్సోరా వెళ్తున్న రైలు టోక్ అనే చిన్న పట్టణం వద్ద పట్టాలు తప్పడంతో ఈ ఘోరప్రమాదం చోటు చేసుకున్నదట.ఇక ఈ తాజా ఘటనపై అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.