`తల్లి` అవ్వడం అనేది పెళ్లైన ప్రతి మహిళ జీవితంలోనూ ఒక అద్భుత, అపూర్వమైన ఘట్టం అని అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.అసలు, అమ్మ అని పిలిపించుకున్నప్పుడే మహిళజన్మ సార్థకం అవుతుంది.
అయితే ఓ బిడ్డకి జన్మనివ్వాలంటే ఆ తల్లి పడే బాధ మాటల్లో వర్ణించలేనిది. నవ మాసాలు ఎన్నో కష్టాలు, నొప్పులు అనుభవించా.
చివరికి చావు అంచుల్ని చని చూసినా.బిడ్డని చూసిన మరు క్షణమే అన్ని బాధలు మరచిపోతుంది ఆ తల్లి.
ఇక గర్భం దాల్చిన తర్వాత ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎందుకంటే.
ఆ టైమ్లో ప్రతి ఒక్కటీ కడుపులోని బిడ్డ ఎదుగుదలపై ఆధారపడి ఉంటాయి.అందుకే డాక్టర్లు కూడా జాగ్రత్తగా ఉండమని.
పోషకాహారం తీసుకోమని చెబుతారు.ఇక ఇవన్నీ పక్కన పెడితే.
ప్రెగ్నెన్సీ సమయంలో ఏడిస్తే బిడ్డకు ప్రమాదమా.? అని చాలా మందిలో ఉన్న సందేహం.అయితే సాధారణంగా కడుపులోని బిడ్డ అప్పుడప్పుడు కాళ్లతో తన్నడం చేస్తుంటారు.ఇలా చేస్తే బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడని చెబుతారు.
ప్రెగ్నెన్సీ మహిళ కరెక్ట్గా పోషకాహారం తీసుకోవడం, సంతోషంగా ఉండడం, ఏవైనా శబ్దాలు విన్నప్పుడు బిడ్డ తన్నడం చేస్తుంటాడు.అలాగే ఎమోషన్స్ కూడా కడుపులోని శిశువుకు తెలుస్తాయని అంటున్నారు నిపుణులు.
అంటే ప్రెగ్నెన్సీ మహిళ హ్యాపీగా, యాక్టీవ్గా ఉంటే బిడ్డ కూడా అలానే ఉంటారు.ఎప్పుడూ ఏడుస్తూ బాధపడటం చేస్తే కడుపులోని బిడ్డ కూడా అలానే బాధగా ఉంటారట.
అంతేకాదు, ప్రెగ్నెన్సీ మహిళ ఎప్పుడూ బాధపడుతూ ఉంటే.పిల్లల పెరిగి పెద్దయ్యాక కూడా మూడీగా, విచారంగా ఉంటారట.
అందుకే గర్భంతో ఉన్నప్పుడు ఎప్పుడు నవ్వుతూ, హ్యాపీగా ఉండాలని డాక్టర్లు, పెద్దలు చెబుతూనే ఉంటారు.