కిడ్నీ స్టోన్స్ లేదా మూత్రపిండాల్లో రాళ్లు.ఇటీవల రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్య ఇది.
నీటిని శరీరానికి సరిపడా అందించకపోవడం, ఒకే చోట గంటలు తరబడి కూర్చోవడం, మాంసాహారం అధికంగా తీసుకోవడం, టీ కాఫీలను పరిమితికి మించి తాగడం, మద్యపానం, మూత్రాన్ని ఆపుకోవడం, మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు వంటి కారణాల వల్ల స్టోన్స్ ఏర్పడుతుంటాయి.వీటిని నిర్లక్ష్యం చేస్తే స్టోన్స్ పెద్దగా మారిపోతాయి.
దాంతో వీటిని తొలగించడానికి శస్త్ర చికిత్స అవసరం అవుతుంది.
ఆపరేషన్ ప్రమాదకరమైనది మరియు దాని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది.
అందు వల్లనే కిడ్నీల్లో స్టోన్స్ను తొలి దశలోనే సహజ పద్ధతుల్లో నివారించుకోవాలి.అయితే అందుకు అద్భుతమైన, సమర్థ వంతమైన ఇంటి చిట్కాలు కొన్ని ఉన్నాయి.
అవేంటో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మరసం, ఆలివ్ నూనె.
ఈ రెండిటినీ కలిపి తీసుకుంటే కిడ్నీల్లో స్టోన్స్ కరుగుతాయి.అవును, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ రసంలో అర స్పూన్ ఆలివ్ నూనెను మిక్స్ చేసి తీసుకోవాలి.
ఆపై ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని సేవించాలి.ఇలా చేయడం వల్ల కిడ్నీల్లో రాళ్లు క్రమంగా కరిగి పోతాయి.
బ్లాక్ కరెంట్ పండ్లు కూడా మూత్ర పిండాల్లో ఏర్పడిన రాళ్లను నివారించగలవు.ఒక కప్పు చప్పున ప్రతి రోజు బ్లాక్ కరెంట్ పండ్లను తింటే కిడ్నీలో రాళ్లు తగ్గడమే కాదు.మళ్లీ మళ్లీ ఏర్పడకుండా కూడా ఉంటాయి.
మొక్కజొన్న పొత్తుకు ఉండే పీచుతోనూ కిడ్నీల్లో రాళ్లను కరిగించుకోవచ్చు.
మొక్కజొన్న పొత్తుకు ఉన్న పీచును కొద్దిగా తీసుకుని ఒక గ్లాస్ వాటర్లో నాలుగు నుంచి ఐదు గంటల పాటు నాన బెట్టుకోవాలి.ఆపై ఆ వాటర్ను సేవించాలి.
ఇలా రెగ్యులర్గా చేసినా మంచి ఫలితం ఉంటుంది.