తెలంగాణ రాజకీయాలు ఒకపక్క జల జగడం మరోపక్క హుజురాబాద్ ఎన్నికల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే.మరి కొద్ది నెలల్లో ఈ ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ భార్య జమున సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉప ఎన్నికల పోటీలో తాను ఉన్నట్లు స్పష్టం చేశారు.ఈటల రాజేందర్ లేదా తాను పోటీకి దిగిన రెండు ఒకటేనని ఈటల జమున షాకింగ్ కామెంట్ చేశారు.
అయితే ఈ క్రమంలో ఎవరు పోటీ చేయాలి అనే దాని విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని.ఎవరు పోటీ చేసిన గుర్తు అదే ఉంటుందని తెలిపారు.
ఒక పక్క ఉపఎన్నిక షెడ్యూల్ రాలేదు, అభ్యర్థులు ఎవరో తెలియదు ఇలాంటి తరుణంలో హుజురాబాద్ బై పోల్ తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది.ఏది ఏమైనా బిజెపి పార్టీ తరఫున తాను కూడా పోటీ చేస్తున్నట్లు ఈటల రాజేందర్ భార్య జమున స్పష్టం చేశారు.
ఇప్పటికే జమున హుజురాబాద్ నియోజకవర్గంలో పలు వార్డులలో తిరుగుతూ ఈటల రాజేందర్ చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ ప్రజలకు వివరిస్తున్నారు.ఇటువంటి తరుణంలో జామున చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి.