ఇటీవల హైదరాబాద్ నుండి ఢిల్లీకి ప్రత్యేక విమానాల్లో ఈటల రాజేందర్ బయలుదేరి అక్కడ కాషాయ కండువ కప్పుకున్న సంగతి తెలిసిందే.బీజేపీలో ఈటల రాజేందర్ జాయిన్ కావటంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.
ఈ నేపథ్యంలో ఢిల్లీ లో జాయిన్ అయిన తర్వాత మరుసటి రోజు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న ఈటల రాజేందర్ తొలిసారి సొంత నియోజకవర్గం హుజరాబాద్ కి బిజెపి నాయకులతో కలిసి బయలుదేరారు.ఈ పర్యటనలో మాజీ చైర్మన్ స్వామి గౌడ్ కూడా ఈటల రాజేందర్ వెంట ఉన్నారు.
దాదాపు నాలుగు రోజులపాటు ఈటల రాజేందర్ అదేవిధంగా బిజెపి నాయకులు నియోజకవర్గంలో పర్యటించి స్థానిక బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పార్టీ బలోపేతానికి కావాల్సిన నిర్ణయాల విషయంలో చర్చించనున్నారు.ముఖ్యంగా ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటంతో మరో ఆరు నెలల్లో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్న క్రమంలో వాటిని దృష్టిలో పెట్టుకుని కూడా ఈటల స్థానిక బిజెపి నాయకులతో వ్యూహాలు వేస్తున్నట్లు సమాచారం.
మరోపక్క అధికార పార్టీ టిఆర్ఎస్ కూడా హుజురాబాద్ నియోజకవర్గం పై ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది.
.