మాజీ మంత్రి తెలంగాణ సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్ అనుకున్న ముహూర్తానికి ఢిల్లీలో చేరుకుని బీజేపీలో జాయిన్ అయ్యారు.ఇదే టైమ్ లో హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కూడా బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ బిజెపి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ .అరవింద్, బాపూరావు, డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అదే రీతిలో తరుణ్ చుగ్ సమక్షంలో ఈటల, రమేష్ రాథోడ్ కాషాయ కండువా కప్పుకోవడం జరిగింది.పార్టీ సభ్యత్వాన్ని కూడా ఈటల కి ఇదే సందర్భంలో అందజేశారు.
వీళ్లతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ, గండ్ర నళిని తదితరులు బీజేపీలో చేరారు.
కాగా తిరిగి రేపు హైదరాబాద్ కి ఈటల రాజేందర్ చేరుకోనున్నారు.ఈటల బిజెపిలోకి వెళ్ళటంతో తెలంగాణలో సరికొత్త రాజకీయ వాతావరణం నెలకొంది.
.