అక్కినేని ఫ్యామిలీకి చెందిన హీరోగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో సుశాంత్, తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకునేందుకు చాలా ప్రయత్నిస్తున్నాడు.సుశాంత్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా, మంచి టాక్ను మాత్రం సొంతం చేసుకుంటాయి.
కాగా ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ మూవీ ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో కీలక పాత్రలో నటించిన సుశాంత్, ఇప్పుడు సోలో హీరోగా తన నెక్ట్స్ చిత్రాన్ని రెడీ చేస్తున్నాడు.
ఇప్పటికే షూటింగ్ కూడా మొదలుపెట్టుకున్న ఈ సినిమాకు ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ను ఫిక్స్ చేశారు.
ఇక ఈ సినిమా తరువాత మరో సినిమా చేసేందుకు సుశాంత్ రెడీ అవుతున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్గా తెలుగు బ్యూటీ ఈషా రెబ్బాను తీసుకునేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోన్నట్లు తెలుస్తోంది.
తెలుగమ్మాయిగా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈషా, వరుసబెట్టి సినిమాలు చేస్తూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకుంది.అయితే సినిమా అవకాశాలు ప్రస్తుతం ఎక్కువగా లేకపోవడంతో సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు చుక్కలు చూపిస్తూ వస్తోంది.
ఇప్పుడు సుశాంత్ సరసన హీరోయిన్గా ఛాన్స్ రావడంతో ఈషా రెబ్బా ఫుల్ ఖుషీగా ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఏదేమైనా ఈ సినిమాతో అక్కినేని కాంపౌండ్లో అడుగుపెడుతున్న ఈషా, ఈ సినిమాతోనైనా అదృష్టాన్ని దక్కించుకుంటుందో లేదో చూడాలి.ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం అమ్మడికి మళ్లీ ఆఫర్లు వచ్చి పడటం ఖాయమని అంటున్నారు సినీ ఎక్స్పర్ట్స్.