తెలుగు సినీ నటి తెలుగు అమ్మాయి ఈశా రెబ్బా.ఈ బ్యూటీ తన అందంతో మాత్రమే సినిమాలలో అవకాశాలు అందుకుంది.
నిజానికి తన అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈషా.తన ఫేస్ బుక్ లో షేర్ చేసిన ఆమె ఫోటోలతో హీరోయిన్ గా అవకాశం అందుకుంది.డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఆమె ఫోటోలను చూసి ‘అంతకుముందు.
ఆ తర్వాత’ అనే సినిమాలో అవకాశాన్ని అందించాడు.
దీంతో ఈ సినిమా తో తొలిసారి నటనతో మంచి సక్సెస్ అందుకున్న ఈషా రెబ్బా ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.కానీ అంత సక్సెస్ అందుకోలేకపోయింది.దీంతో అవకాశాలు కూడా ఈ బ్యూటీ దరికీ రాలేవు.
ఇక సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది.మొదట్లో ట్రెడిషనల్ లుక్ లో తెలుగమ్మాయిగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు గ్లామర్ ను పరిచయం చేసింది.
ఈ మధ్య తన గ్లామర్ తో తగ్గేది లేదంటూ డోస్ పెంచింది.సోషల్ మీడియా వేదికగా తను చేయించుకున్న ఫోటో షూట్ లను అభిమానులతో బాగా షేర్ చేసుకుంటుంది.
ఇక ఈమె ఫోటోలను చూసిన అభిమానులు కూడా ఇంత అందంగా ఉన్నా కూడా అవకాశాలు ఎందుకు అందుకోవట్లేదని తెగ ఫీల్ అవుతుంటారు.ఇక తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అందులో తన నిజమైన ప్రేమ ఇదే అంటూ చూపించింది.
తన పెట్ లతో దిగిన ఫోటోను షేర్ చేసుకుంటూ పప్పీ లవ్ ఈస్ బెస్ట్ లవ్ అని క్యాప్షన్ ఇచ్చింది.ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారగా తన అభిమానులు తెగ లైక్స్ చేస్తున్నారు.