తెలుగమ్మాయి ఈషా రెబ్బ తన యాక్టింగ్ తో టాలీవుడ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నప్పటికి ఇంకా స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకోవడం లేదు.తెలుగు పాపలు గ్లామర్ షోకి దూరంగా ఉంటారు అనే కామెంట్ కి అమ్మడు గత కొంత కాలంగా గ్లామర్ షోతో సమాధానం చెబుతూనే ఉంది.
స్టార్ హీరోల సినిమాల్లో చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడం లేదు.అయితే ఇప్పుడు ఈ బేబీ ఉమెన్ సెంట్రిక్ సినిమాతో రెడీ అవుతోంది.కామెడీ సినిమాలతోనే కాకుండా డమరుకం సినిమాతో గతంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఇక రీసెంట్ గా టైటిల్ ను కూడా బయటపెట్టారు.
‘రాగల 24గంటల్లో’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ కథలో బేబీ డిఫరెంట్ షేడ్స్ లో మెరవనుందట.సింగిల్ సిట్టింగ్ లొనే స్క్రిప్ట్ ను ఫైనల్ చేసిన ఈషా సినిమాపై చాలా నమ్మకంగా ఉందట.ఎంతో కాలంగా మంచి అవకాశం కోసం ఎదురుచూస్తోన్న అమ్మడికి ఈ సినిమా మంచి బూస్ట్ ఇస్తుందట.చాలా మంది హీరోయిన్స్ ఉమెన్ సెంట్రిక్ ఫిలిమ్స్ తో కెరీర్ ను మంచి ట్రాక్ లోకి తెచ్చుకున్నారు.
మరి ఈ బ్యూటీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.