తెలుగులో ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ “నారప్ప” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ చిత్రంలో తమిళ బ్యూటీ ప్రియమణి హీరోయిన్ గా నటిస్తుండగా అభిరామి వెంకటాచలం, టాలీవుడ్ ప్రముఖ నటుడు రావు రమేష్, రాజీవ్ కనకాల, తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.
కాగా ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించగా ప్రముఖ తెలుగు సినీ నిర్మాత సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తూ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు.కాగా ఈ చిత్రం తమిళంలో ప్రముఖ నటుడు ధనుష్ హీరోగా నటించిన “అసురన్” చిత్రానికి రీమేక్ గా తెరకెక్కించారు.
అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రజలు సినిమా థియేటర్లకు వచ్చే సూచనలు లేకపోవడంతో ఈ చిత్రాన్ని ఈనెల 20వ తారీకు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో చిత్ర యూనిట్ సభ్యులు ప్రసారం చేయనున్నారు.
దీంతో చిత్ర యూనిట్ సభ్యులు “నారప్ప” చిత్రాన్ని బాగానే ప్రమోట్ చేస్తున్నారు.
కాగా ఈ మధ్య విక్టరీ వెంకటేష్ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటున్నాడు.తాజాగా ఈ చిత్రంలోని ఓ డైలాగ్ ని విక్టరీ వెంకటేష్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడ.
అయితే ఇందులో “డబ్బుని ఇతరులు దోచుకోవచ్చు.కానీ చదువుని మాత్రం ఎవరు దోచుకో లేరంటూ” ఓ ఫోటోని షేర్ చేశాడు.దీంతో ప్రస్తుతం ఈ డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అలాగే నేటి తరానికి చదువు గురించి మంచి మెసేజ్ ఇచ్చారని పలువురు సెలబ్రిటీలు వెంకటేష్ ని అభినందిస్తున్నారు.
కాగా విక్టరీ వెంకటేష్ అభిమానులు కూడా ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.మరి నారప్ప చిత్రంతో తన అభిమానుల అంచనాలను విక్టరీ వెంకటేష్ అందుకుంటాడో లేదో చూడాలి.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తెలుగులో ప్రముఖ దర్శకుడు “అనిల్ రావిపూడి” తెరకెక్కిస్తున్న “ఎఫ్ 3” చిత్రంలో కూడా హీరోగా నటిస్తున్నాడు.ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో మొదలైనట్లు సమాచారం.గత ఏడాదిలో “ఎఫ్ 3” మంచి హిట్ అందుకున్న విక్టరీ వెంకటేష్ “నారప్ప” చిత్రంతో మరో హిట్ అందుకుని హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.