రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.కానీ కొంతమంది విద్యార్థుల భవిష్యత్తు అడ్డంపెట్టుకుని పరీక్షల విషయంలో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో మే నెల 5వ తారీఖున ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.దీంతో ఈ రోజు నుండి ఇంటర్ విద్యార్థులు హాల్ టికెట్లు వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో పరీక్ష కేంద్రాలు ఉండగా గుంటూరు జిల్లాలో తక్కువ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ.పరీక్ష కేంద్రాల వద్ద ధర్మ స్క్రీనింగ్ మరియు మాస్క్ లు అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు.అంతేకాకుండా మొబైల్ మెడికల్ వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.
ఇదే క్రమంలో ప్రతి జిల్లాకు ఒక కోవిడ్ స్పెషల్ అధికారి ఉంటారని పేర్కొన్నారు.