ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏడు చేపల కథ సినిమాకు వస్తున్న వసూళ్లు ట్రేడ్ వర్గాల వారిని కూడా ఆశ్చర్య పర్చుతున్నారు.కేవలం రెండున్నర కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రంకు మొదటి రెండు రోజుల్లో ఏకంగా మూడు కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి.
ఇక నిన్న ఆదివారం సందర్బంగా మరో కోటి వరకు వచ్చి ఉంటాయంటూ ప్రచారం జరుగుతోంది.మొదటి వీకెండ్ పూర్తి అయ్యేప్పటికి దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలు వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.
భారీ బడ్జెట్తో రూపొందిన సినిమాలు పెట్టిన బడ్జెట్ను రాబట్టడంలో కిందా మీదా పడుతున్నాయి.సైరా చిత్రం 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కితే కేవలం 200 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.అలాంటిది రెండున్న కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బడ్జెట్కు దాదాపుగా అయిదు రెట్ల వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.అంటే పెద్ద సినిమాల కంటే ఇలా చిన్న సినిమాలు చేసుకోవడం తీసుకోవడం ఉత్తమం అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
బూతు సినిమాలకు సంబంధించి ఎప్పుడైనా కలెక్షన్స్ బాగానే ఉంటాయి.మొదటి నుండి కూడా దక్షిణాది ప్రేక్షకులు బూతు సినిమాలు అంటే ఒకింత ఆసక్తి చూపిస్తారు.వల్గర్ కంటెంట్, బూతులు ఉంటే సినిమాకు పెద్ద ఎత్తున వసూళ్లు వచ్చిన దాఖలాలు చాలా చాలా ఉన్నాయి.
గతంలో కూడా ఏడు చేపల కథ వంటి సినిమాలు చాలా వచ్చాయి.వాటికి కూడా పరిస్థితి ఇలాగే ఉందంటూ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మొత్తానికి ఏడు చేపల కథకు వస్తున్న కలెక్షన్స్ సినీ వర్గాల వారిని విష్మయానికి గురి చేస్తోంది.