మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం రీమేక్ గా భీమ్లా నాయక్ సినిమా వస్తుంది.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్నారు.
ఈ సినిమాను సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు.మాటల మాంత్రికుడు త్రివిక్రం ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.
అసలైతే సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఫిబ్రవరికి వాయిదా పడ్డది.ఫిబ్రవరి 25న అయినా సినిమా వస్తుందా రాదా అన్నది తెలియాల్సి ఉంది.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఎడిటింగ్ విషయంలో డైరక్టర్ సాగర్ చంద్ర, స్క్రీన్ ప్లే రైటర్ త్రివిక్రం కు పొంతన కుదరట్లేదని టాక్.పేరుకే డైరక్టర్ గా సాగర్ చంద్రని పెట్టారు .కానీ సినిమా మొత్తం త్రివిక్రం దగ్గర ఉండి చూసుకుంటున్నాడు.సినిమా ఎడిటింగ్ విషయంలో కూడా డైరక్టర్ సాగర్ చంద్ర ఒక వర్షన్.
త్రివిక్రం మరో వర్షన్ ఎడిటింగ్ చేస్తున్నారట.ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉన్నా ఒక సినిమాకు రెండు వర్షన్ ల ఎడిటింగ్ ప్రాబ్లం అవుతుందని తెలుస్తుంది.
మరి భీమ్లా నాయక్ సినిమాపై వస్తున్న ఈ వార్తల్లో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.