టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని చూస్తున్నాడు ఈ అర్జున్ రెడ్డి.
ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పెద్ద చిక్కొచ్చి పడిందని చిత్ర యూనిట్ అంటోంది.ఈ సినిమాకు ఎడిటింగ్ చాలా తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు అడ్డుగా ఉన్న అదనపు సీన్స్ను తీసేయాలని దర్శకుడు క్రాంతి మాధవ్ భావిస్తున్నాడు.అయితే అవి సినిమా కథకు చాలా కనెక్ట్ అయ్యి ఉండటం, వాటిని తీసేస్తే ముందు, వెనకాల వచ్చే సీన్లు అసంపూర్తిగా ఉంటాయని దర్శకుడు, ఎడిటర్లు అంటున్నారు.
దీంతో ఏ సీన్ను ఉంచాలో, ఏ సీన్ను లేపేయాలో అర్ధంగాక వారు తలలు పట్టుకుంటున్నారు.ఏకంగా నలుగురు హీరోయిన్లు ఉన్న ఈ సినిమాలో సీన్లు ఎక్కువ కావడం సహజం.
మరి ఈ తలనొప్పిని దర్శకుడు, ఎడిటర్ ఎలా పరిష్కరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.రాశి ఖన్నా, కేథరిన్ త్రేసా, ఐశ్వర్య రాజేష్, ఇజబేల్ లీట్లు హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాలో నలుగురు అమ్మాయిలను ప్రేమించే ప్రేమికుడిగా రౌడీ అదరగొట్టనున్నాడు.
గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లవర్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.