మూడోసారి ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ...!!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) మూడోసారి ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో దాదాపు 10 గంటల పాటు ఈడీ అధికారులు ఆమెను విచారించారు.

 Ed Trial Of Mlc Kavitha Ended For The Third Time , Delhi Liquor Scam, Ed, Mlc Ka-TeluguStop.com

ఇదే సమయంలో ఆమె గత కొంతకాలంగా వాడిన ఫోన్లను ఈడీకి సమర్పించడం జరిగింది.ఈడీ విచారణకు వెళ్లే ముందు తాను వాడిన ఫోన్లను సీల్డ్ కవర్ లో కవిత మీడియాకు చూపించడం జరిగింది.

కాగా కవితను విచారిస్తున్న సమయంలోనే సాయంత్రం ఆమె లీగల్ టీం ఈడీ కార్యాలయానికి చేరుకోవటం సంచలనం సృష్టించింది.

అయితే ఈడీ అధికారులకు కవిత లీగల్ టీం పలు డాక్యుమెంట్లను అందించడం జరిగినట్లు సమాచారం.దీంతో నేటి విచారణ ముగిసినట్లు ఈడీ తెలపటంతో ఎమ్మెల్సీ కవిత ఈడీ కార్యాలయం నుండి బయటకు వచ్చారు.చిరునవ్వుతో విక్టరీ సింబల్ చూపిస్తూ కారులో ఆమె నివాసానికి బయలుదేరడం జరిగింది.

ఈ క్రమంలో ఈడీ ఆఫీసు బయట BRS కార్యకర్తలు ఉండకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.దాదాపు 10 గంటల పాటు ఎమ్మెల్సీ కవితని ఈడీ అధికారులు ప్రశ్నించడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube