కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కు ఈడీ సమన్లు జారీ చేసింది.దీనిలో భాగంగా రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
యంగ్ ఇండియా సంస్థ విచారణ కేసులో భాగంగా శివకుమార్ కు సమన్లు ఇచ్చింది.గత నెలలోనూ మనీలాండరింగ్ కేసుతో పాటు నేషనల్ హెరాల్డ్ కేసులోనూ ఈడీ శివకుమార్ ను విచారించిన సంగతి తెలిసిందే.
సోనియా, రాహుల్ గాంధీల సారథ్యంలో యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ట్రస్టుకు తన కుటుంబం చేసిన విరాళాలపై ప్రశ్నించారని ఆయన వివరించారు.